బాలింతల వార్డును సందర్శించిన సిపిఐ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిపిఐ రామగుండం నగర సమితి నేతృత్వంలో బాలింతల వార్డును.. సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉన్న బాలింతలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డైట్ కాంట్రక్టర్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. రోజు వారిగా మెను ప్రకారం బాలింతలకు పాలు, గుడ్డు, బ్రెడ్డు, డ్రై ఫ్రై ఫుడ్ అందించకపోవడం వల్ల బాలింతలు అరిగోస పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తొడుపునూరి రమేష్ కుమార్, మండల శ్రీనివాస్, నరేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.