జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన అయ్యప్ప పడి పూజ, అయ్యప్ప జాతర కార్యక్రమానికి జెడ్పీ ఛైర్మన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, గోపు రాజేష్, సుమన్ రావు, అయ్యప్ప సేవ సంఘం ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.