శబరిమల మకరజ్యోతి దర్శనం (వీడియో)
మకర సంక్రాంతి పర్వదినాన శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో శుక్రవారం సాయంత్రం మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మకర జ్యోతి దర్శనం కాగానే స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో శబరిమల సన్నిధానం మార్మోగింది. మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు.