జీహెచ్ఎంసీ మేయర్గా విజయలక్ష్మి బాధ్యతలు..
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్ ఎన్నికలో తెరాస పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్గా, డిప్యూటీ మేయర్గా శ్రీలత ఎన్నికైన విషయం తెలిసిందే.