Beaking News : ప్రాణం తీసిన గాలిపటం
సంక్రాంతి పండగ పూట ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగకు ఆనందంగా ఎగవేసిన గాలిపటం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళ్తున్నాడు. ఆ వ్యక్తికి గాలిపటం మాంజా మెడకు చుట్టుకోవడంతో లోతైన గాయం ఏర్పడిండి. రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే చైనా మాంజాలు, వైర్ల లాంటి దారాలు వాడకూడదని పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.