తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!
బిహార్ రంజీ ఆటగాడు షకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గని రికార్డులకెక్కాడు.
రంజీ ట్రోఫి 2021-22 సీజన్లో భాగంగా మిజోరామ్తో జరిగిన మ్యాచ్లో షకీబుల్ గని ట్రిపుల్ సెంచరీ సాధించాడు. గని కేవలం 387 బంతుల్లోనే 300 పరుగులు చేశాడు. ఇక బిహార్ తొలి ఇన్నింగ్స్లో షకీబుల్ మొత్తంగా 405 బంతుల్లో 341 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 56 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ కావడం గమనార్హం.
అంతకు ముందు 2018-2019 రంజీ ట్రోఫీ సీజన్లో మధ్య ప్రదేశ్ ఆటగాడు అజేయ్ రోహరా 267 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న బిహార్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 686 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో గని.. బాబుల్ కుమార్తో కలిసి నాలుగో వికెట్కు 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరో వైపు బాబుల్ కుమార్ కూడా డబుల్ సెంచరీ సాధించాడు.
: