Print Friendly, PDF & Email

ఈ వేరును అక్కడ కడితే ఇంట్లో డబ్బులు రెట్టింపు అవుతాయి..!

0 9,273

మనం ఎంత సంపాదించిన కూడా చేతిలో ఉండదు.. డబ్బులు వచ్చినవి వచ్చినట్లు పోవడం, ఇంట్లో చికాకులు కూడా ఉంటాయి.. వాటి నుంచి విముక్తి పొందడానికి కొన్నిటిని తప్పక ఫాలో అవ్వాలని అంటున్నారు.అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వేరును అక్కడ కడితే ఇంట్లో డబ్బులు రెట్టింపు అవుతాయి..!

వినాకుడు ఆది దేవుడు..వినాయకుడికి ఉంచే పత్రిలో దర్భలు ఒకటి. ఇవి అంటే ఆయనకు ఇష్టం.. కనుకనే దర్భలతో ఆయనను పూజిస్తారు. ఇక ప్రతి శుభ కార్యంలోనూ దర్భలను వాడుతుంటారు..దీన్ని దేవుడి మరో రూపంగా చూస్తారు.శుభకార్యాల్లో దర్భలను తప్పక ఉపయోగిస్తుంటారు. ఇక గ్రహణ సమయంలో ఇంట్లో తినే వస్తువులపై దర్భలను ఉంచుతారు. గ్రహణం వీడాక దర్భలను తీసేస్తారు.ఇలా చేయడం వల్ల మనం తినే ఆహారాలతో మనకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. అయితే ఇన్ని ప్రయోజనాలున్న దర్భలతో మనకు ఒక గొప్ప లాభం కూడా కలుగుతుంది..

దర్భలను ఇంటికి తెచ్చి పూజలు చేసి వాటిని మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటి వైపు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే దోషాలు అన్నీ పోతాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని వారికి సమస్యలు తగ్గుతాయి. అలాగే ధనం లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు.దర్భలను ఎప్పుడు పడితే అప్పుడు తేకూడదు. భరణి నక్షత్రం రోజున దర్భలను తెచ్చి శుభ్రం చేయాలి. దర్భలను వేళ్లతో సహా సేకరించాలి. నాలుగైదు దర్భలను సేకరించి ఇంటికి తెచ్చి శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత వాటికి పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. తరువాత ఆ దర్భలను కట్టగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటి వైపు కట్టాలి..ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది. ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే తగ్గుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు పోయి ధనం బాగా సంపాదిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.మీకు అన్నీ బాధలు పోయి సంతోషాలు వెలు వెత్తుతాయని అంటున్నారు..

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents