ప్రజావాణికి 323 ధరఖాస్తులు
జెడ్పి సి.ఈ.ఓ ప్రియాంక
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జెడ్పి సి.ఈ.ఓ ప్రియాంక అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 323 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ఆమె స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు ఆమె తెలిపారు. ఇందులో ఎస్సీ కార్పోరేషన్ కు చెందినవి 175, రెవెన్యూకు సంబంధించినవి 86, పంచాయతి శాఖకు చెందినవి 10, మున్సిపల్ కు చెందినవి 13, కాగా ఇతర శాఖలకు సంబంధించినవి 39 ఉన్నాయని తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఓ. లక్ష్మారెడ్ది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, షెడ్యుల్డ్ కులాల అభివృద్ది అధికారి నతానియేలు, డి.వై.ఎస్.ఓ రాజవీర్, పిడీ మెప్మా రవిందర్, వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి రాజ మనోహర్ రావు, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, ఏడి ల్యాండ్ అండ్ సర్వే అశోక్ కుమార్, సిపిఓ కొమురయ్య, జిల్లా పంచాయతి అధికారి వీర బుచ్చయ్య, జిల్లా గిరిజన అభివృద్ది అధికారి గంగారాం, ఎల్.డి.యం. ఆంజనేయులు, డిప్యూటీ తహశిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.