మానేర్ రివర్ ఫ్రంట్ తో కరీంనగర్ కు పర్యాటక శోభ
రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమం శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశా మందిరంలో ఆస్ట్రేలియా కు చెందిన లేజర్ విజన్ కంపెనీ మరియు ఇండియాలోని
ఎఫ్ పి ఏ కంపెనీల ప్రతినిధుల బృందం మానేరు రివర్ ఫ్రంట్ లో నిర్మించే వాటర్ ఫౌంటెన్ లేజర్ షో ,హాంపి థియేటర్ లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంతో కలిసి మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా వాటర్ ఫౌంటెన్ లేజర్ షోకు అనువైన ప్రదేశాన్ని సర్వే చేసి త్వరలోనే డిపిఆర్ సిద్ధం చేయాల్సిందిగా మంత్రి వారిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు…
ఇప్పటికే సివిల్ వర్క్ లు ప్రారంభించమని,భారీ వర్షాల నేపథ్యంలో వరదల వల్ల పనులు మందగించాయని రానున్న వేసవికాలం వరకు పనుల్లో వేగం పెంచి యేడాదిన్నరలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.మానేరు రివర్ ఫ్రంట్ పరిసరాలను సుందరీకరించేందుకు పర్యాటక శాఖ నుండి 100 కోట్లు మంజూరయ్యాయని, రివర్ ఫ్రంట్ మధ్యలో నిర్మించే వాటర్ ఫాంటేన్ ,లేజర్ షో ,హాంపి థియేటర్ లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు..లేజర్ షో, వాటర్ ఫౌంటెన్ పనులకు 6 నెలల్లో డీపీఆర్ పూర్తిచేసి టెండర్లు పిలుస్తామని తెలిపారు… సీఎం కేసీఅర్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మానేరు రివర్ ఫ్రంట్ ను రాబోయే ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేసే వాటర్ ఫౌంటేన్, లేజర్ షో,థియేటర్ల కోసం ఆస్ట్రేలియాకు చెందిన లేజర్ విజన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ లో పర్యాటక అభివృద్ది కోసం 100 కోట్లు కేటాయించామన్నారు. లేజర్ విజన్ కంపెనీకి దుబాయ్, మక్కా, వియత్నాం, హాంకాంగ్, సింగపూర్ లలో పలు ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ కూడా మంచి వాటర్ ఫౌంటేన్స్, లేజర్ షోల డిజైన్లు తయారు చేసేందుకు ఈ సంస్థ ఇండియాలోని ఎఫ్.పి.ఏ కంపెనీతో కలిసి సర్వే చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవి శంకర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్ల స్వరూపరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక తదితరులు పాల్గొన్నారు