ఎవరూ మాట్లాడవద్దు.. బీజేపీ నేతలకు అధిష్ఠానం ఆదేశం!

కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనపై ఆచితూచి స్పందించాలని బీజేపీ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎవరూ ఈ అంశంపై మాట్లాడవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.

న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమై కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన.. అనంతర పరిణామాలపై చర్చించారు. జాతీయ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వేచిచూసే ధోరణి అవలంబించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. తెలంగాణ నేతలు కానీ, జాతీయ నాయకులు కానీ స్పందించరాదని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ మౌఖికంగా సమాచారం అందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents