సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమి
ఇంగ్లాండ్తో గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్-2022 సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలైంది. వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలోనే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించి, ఫైనల్కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 పరుగులు చేసింది. లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ (80), అలెక్స్ హేల్స్ (86) చెలరేగి ఆడారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ ఓటమితో భారత్ అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు.