ఫోన్ హ్యాక్ చేసి రూ.కోటి కొట్టేశారు!
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముంబయిలో ఓ వ్యాపారవేత్త ఫోన్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుండి దాదాపు రూ. కోటి మాయం చేశారు. నవంబర్ 6-7 తేదీలలో ఫోన్ ను హ్యాక్ చేసి ఆయన ఖాతా నుండి వేరే ఖాతాకు 99.50 లక్షలు బదిలీ చేసారని,కేసు నమోదు చేసినట్లు బాగ్లే ఎస్టేట్ పోలీసులు తెలిపారు.