మహిళపై దాడి చేసిన కోతులు
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో జాగిరి బాలలక్ష్మి (55) అనే మహిళను మంగళవారం కోతుల ముక్కుమ్మడిగా దాడి చేసి గాయపర్చాయి. మంగళవారం సాయంత్రం 5-00 గంటల ప్రాంతంలో బాలలక్ష్మి తన పక్కింటి మహిళాతో మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.