కొండగట్టు కు సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 15 బుధవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్బంగా రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ యాసిన్ బాష మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వివరించారు. మంగళవారం మధ్యాహాన్నం నుంచి బుధవారం మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు భక్తులను ఆలయ సందర్శన నిలిపి వేస్తున్నట్లు చెప్పారు.
మంత్రి వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జిల్లా ఎస్పీ భాస్కర్, గ్రామ సర్పంచ్ తిరుపతి, కొండగట్టు ఆలయ ఈ.ఓ వెంకటేష్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.