జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ పెద్దపల్లిలో నిరసన
జర్నలిస్టులపై తెలంగాణలో దాడులు పెరుగుతున్నాయని దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శనివారం జర్నలిస్టులు నిరసన తెలుపుతూ, డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని సుద్దాల గ్రామంలో బిజెపి కార్నర్ మీటింగ్ న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన వి6 మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ లీడర్ల పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.