కరీంనగర్ లో వికసిస్తున్న ‘కొత్త’ కమలం

అధిష్ఠానం కనికరిస్తుందా... టికెట్టు లభిస్తుందా...

కొత్త జైపాల్ రెడ్డీ… గతంలో ఎప్పుడు వినిపించని పేరు ప్రస్తుతం కరీంనగర్లో మారుమోగిపోతుంది… బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు చేపట్టి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ రాష్ట్రమంతా తిరుగుతున్నవేళ కరీంనగర్ వికసిస్తున్న మరో కమలమే కొత్త జైపాల్ రెడ్డి. కొత్త జైపాల్ రెడ్డి రాకతో కరీంనగర్ బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. అసలు ఎవరు ఈ కొత్త జైపాల్ రెడ్డి? ఏమి చేస్తుంటారు మరిన్ని వివరాలు మీకోసం…

విద్యార్హ్తలు :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో సంవత్సరంలో కొత్త సత్యనారాయణ రెడ్డి సరోజన దంపతులకు 01అక్టోబర్ 1977 జన్మించారు. కరీంనగర్ హైదేరాబద్ లలో విద్యాబ్యాసాన్ని పూర్తి చేసి 1977లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తరువాత వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.

సామజిక సేవలు :
కొత్త జైపాల్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి ముందు నుండే సామజిక సేవల్లో ముందు ఉండేవారు, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేశారు. పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రజల సమస్యలపై, ప్రజల సంక్షేమం కోసం పోరాడేవారు. జైపాల్ రెడ్డి మిత్రబృందం 1000 మందికి పైగా పేద కుటుంబాలకు సహాయం చేశారు.

న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన జైపాల్ రెడ్డి

అంటే కాకుండా తన స్వగ్రామం లోని మరణ బాధిత కుటుంబానికి వారు బతకడానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా అండగా ఉండేవారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారు ఎవరైనా తనవద్దకు వచ్చి సహాయం కావాలని అడిగితే సుమారు 5000 రూపాయలు ఇచ్చి వారికి సహాయం చేశాడు. అనాథ పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపించేవారు వారికి ఆహారం, దుస్తులు మరియు బెడ్‌షీట్‌లను పంపిణీ చేస్తూ అనుక్షణం వారి భవిష్యత్తు పట్ల బాధ్యతగా ఉండేవారు మరియు వారికీ అవసరమైనప్పుడు కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చి వారికి సహాయం చేసేవారు.

సేవ కార్యక్రమంలో భాగంగా యాక్సిడెంట్ లో కాలు విరిగిన బాధితుడికి పరామర్శ

ముఖ్యంగా కరోనా సమయంలో జైపాల్ రెడ్డి అందించిన సేవలు అనిర్వచనీయం అనే చెప్పాలి.. కరోనా యొక్క మొదటి మరియు రెండవ వేవ్ సమయంలో, లాక్డౌన్ ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆర్థికంగా అండగా ఉన్నారు. కరోనా భయంతో ప్రపంచం అంత అల్లాడుతుంటే తాను మాత్రం తనని నమ్ముకున్న ప్రజలకోసం ముందుండి సంక్షోభ సమయంలోఅవసరమైన వారికి సహాయం చేయడం మరియు లాక్డౌన్ ద్వారా ప్రభావితమైన వారికి మరింత సహాయాన్ని అందించారు. అంటే కాకుండా కోవిడ్‌తో బాధపడుతూ ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వెళ్లలేని కోవిడ్ బాధితులకు బియ్యం సంచులు, కూరగాయలు మరియు మందులను విరాళంగా అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక తిండి దొరకని వారికి నిత్యావసర సరుకులు అందించి పేదలకు ఆర్థికంగా అండగా నిలిచారు. మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు, ఆహారం మరియు కరోనా కిట్‌లతో పాటు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేదలకు సహాయం చేసారు. 1998 నుండి 25 సంవత్సరాల ప్రజా సేవకు మరియు కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రదానం చేశారు.

సేవలకు లభించిన గౌరవ డాక్టరేట్

రాజకీయం:

1996లో జైపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ (టిడిపి) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ కార్యకర్తగా తన విధులను నిర్వర్తిస్తూ ప్రవర్తనా నియమావళితో పాటు సంబంధిత పార్టీ గుర్తింపు కోసం ప్రతి కార్యాచరణను ఎంతో బాధ్యతగా నిర్వహించేవారు. 1999 నుంచి 2001 వరకు తెలుగు యువత గంగాధర మండల అధ్యక్షుడిగా పనిచేసి ప్రజలకు సేవలందించారు. 2006 నుంచి 2007 వరకు రాష్ట్ర తెలుగు యువత సంస్థ కార్యదర్శిగా నిరంతరం ప్రజల ముందు ఉంటూ సమస్యలతో సతమతమవుతూ సంస్థ అభివృద్ధికి కృషి చేశారు. 2011లో నాగం జనార్దన్ రెడ్డి టీడీపీని వీడి నగర సమితి పార్టీ పెట్టినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచిన కొత్త జైపాల్ రెడ్డి టీడీపీని వీడి తెలంగాణ నగర సమితి పార్టీలో చేరారు. 2005 అక్టోబరు 23న సింగిల్ విండో చైర్మన్‌గా నియమితులై నాలుగేళ్లపాటు తన విధులను కొనసాగిస్తూ ప్రజలకు అన్ని విధాలా సేవ చేస్తూ సేవలను అందించారు. నాలుగు సంవత్సరాలు సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేసిన తర్వాత 18 ఫిబ్రవరి 2010న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ రాజీనామా చేశారు. అంతేకాదు 2010లో ఒప్పందంపై సంతకం చేసిన తొలి తెలంగాణ వ్యక్తి కొత్త జైపాల్ రెడ్డి.

నాగం జనార్దన్ రెడ్డితో

తర్వాత 2013 జనవరి 26న మళ్లీ సింగిల్ విండో చైర్మన్‌గా పోటీ చేసి గెలుపొంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మళ్లీ రాజీనామా చేశారు. 2013లో తెలంగాణ సాధన సమితి పార్టీని బీజేపీలో విలీనం చేయగా, కొత్త జైపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. జైపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించాడు తెలంగాణ కోసం పదవులు ముఖ్యం కాదు అని భావించి అవసరం అయినపుడు తన పదవులకు రాజీనామా చేసి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుతెచ్చుకున్నారు. 2018లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన మేడిపల్లి సత్యం అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు మద్దతుగా నిలిచారు. మేడిపల్లి సత్యం గారి ఓటమిని తన ఓటమిగా భావించి జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ తాను మాత్రం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తూ, ప్రజల నుంచి ఎనలేని అభిమానాన్ని పొందారు.

మేడిపల్లి సత్యంకు మద్దతుగా

ప్రస్తుతం my3 గ్రూప్స్ ద్వారా కరీంనగర్, హైదరాబాద్ లలో వివిధ వ్యాపారాలు జైపాల్ రెడ్డి బీజేపీ లోకి రావడంలో కరీంనగర్ బీజేపీ లో మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. జైపాల్ రెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండటమే కాకుండా ఆరెస్సెస్ తో కూడా చాల మంచి సంబధాలు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశాలు. అయన స్వగ్రామం లక్ష్మిదేవిపల్లి చొప్పదండి నియోజకవర్గం లో ఉండటంతో అది రిజర్వేషన్ లో ఉండటంతో అయన కరీంనగర్ నియోజకవర్గం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కరీంనగర్ లో అతి తక్కువ కాలంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. పట్టణంలో ప్రతి డివిజన్ లో ఆయనకి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అన్ని కుల సంఘాలు, వృతి సంఘాలు ఆయనకు మద్దతుగా వస్తున్నారంటే అయన ప్రజలతో ఎంత మమేకంగా ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల అయన జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు పట్టణములో ఘనంగా నిర్వహించారు. పేదలకు బట్టలు, ఆహారం, స్వీట్లు పంపిణీ చేసి అవసరం ఉన్నవారికి ఆర్థిక సహాయం చేసారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ ప్రజల్లో జైపాల్ రెడ్డి అంశం చర్చంశనీయ అయిందనే చెప్పాలి..

నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో

అతితక్కువ సమయంలో ప్రజలకు ఏంటో దగ్గరయ్యి రేసులో ముందున్న జైపాల్ రెడ్డి అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తుందా లేదా అనేది బాగా చర్చంశనీయమ్ అవుతుంది. ఒకవేళ జైపాల్ రెడ్డి బీజేపీ టికెట్ ఇస్తే కరీంనగర్ లో మార్పు జరుగుతుందని అని అయన అభిమానుల అభిప్రాయం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents