వృద్ధురాలిని బస్సులోంచి తోసేసిన కండక్టర్
ఏపీలోని పల్నాడు జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి డిపో వద్ద ఓ వృద్ధురాలు బస్సులో నుంచి దిగుతుండగా కండక్టర్ ఆమెను తొందరపెడుతూ బస్సులోంచి తోసేశాడు. వృద్ధురాలు బోర్లాపడటంతో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. దీనిని పట్టించుకోకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో తోటి ప్రయాణికులు డిపోలోని అధికారులకు, ఇతర ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.