హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..

మన భారతదేశంలో హోలీ సంబరాలను ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద, వర్గ బేధాలేమీ లేకుండా.. ప్రతిఒక్కరూ ఈ వేడుకను జరుపుకుంటారు. అందరూ రోడ్లమీదకొచ్చి.. రంగులు పూసుకుంటారు. చివరికి శతృవులు కూడా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టేసి.. ఈ వేడుకల్లో ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఈ హోలీ సంబరాల్లో.. ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కేవలం రంగు పూసిన పాపానికి.. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. పెట్రోల్ పోసి మరీ నిప్పంటించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

రేగోడ్ మండలం మర్పల్లిల్లో అందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిఒక్కరూ సరదాగా హోలీ ఆడుతూ.. ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజయ్య, షబ్బీర్ ధమ్య ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. షబ్బీర్ మీద రంగు పూసేందుకు అజయ్య ప్రయత్నించాడు. తన మీద రంగు పూయొద్దని చెప్పినా.. అంజయ్య వినకుండా రంగు పూశాడు. దీంతో కోపాద్రిక్తుడైన షబ్బీర్.. ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వివాదం ముదిరింది. అప్పుడు షబ్బీర్ పెట్రోల్ తీసుకొచ్చి, అంజయ్యపై పోసి, నిప్పంటించాడు. ఈ నిప్పుల్లో అంజయ్య శరీరం చాలా వరకు కాలింది. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అతడ్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంజయ్య పరిస్థితి విషమంగానే ఉంది.

మరోవైపు.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన షబ్బీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం రంగు పూసిన కోపంలోనే షబ్బీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేకపోతే గతంలో వీరి మధ్య గొడవలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అటు.. అంజయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవ్వడంతో, అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents