Print Friendly, PDF & Email

బండిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం

0 1,228
దళితులను అణగ తొక్కుతున్న బండి, ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ తీరును ఎండగడతాం, ధర్మపురి నియోజకవర్గ భాజపా సీనియర్ నాయకులు కన్నం అంజయ్య

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును  అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామని ధర్మపురి నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు కన్నం అంజయ్య అన్నారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో దళితుల, సీనియర్ నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దళితులలో మాదిగ వర్గానికి పదవులు ఇవ్వకుండా బండి సంజయ్ కుమార్ అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో భాజపా చేపట్టబోయే ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ ను సీనియర్ నాయకులు, దళిత నాయకులు నిలదీస్తారని హెచ్చరించారు. 20 ఏళ్లుగా భాజపా పార్టీని నమ్ముకుని ధర్మపురి నియోజకవర్గంలో పని చేస్తుంటే  కాంగ్రెస్ నుండి వచ్చిన వివేకును ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించకుంటే అధిష్టానం వద్దనే తేల్చు తేల్చుకుంటామని స్పష్టం చేశారు. బండి సంజయ్ కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు

బండిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents