ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్

TSPSC లో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయ్యాలి. Tspsc ప్రస్తుత బోర్డ్ ను రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చెయ్యాలి.

గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర రాజన్ గారిని కలిసిన ఈటల రాజేందర్, బీజేపీ నేతలు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై గవర్నర్ కి ఫిర్యాదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.

ఈటలరాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ విద్యార్థుల కళ్ళలో మట్టి కొట్టారు. ఒక్కో విద్యార్థి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్షాం రద్దు చేస్తున్న అని కేసీఆర్ తప్పించుకుంటున్నారు. కెసిఆర్ కి రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కి పట్టింపు లేదు. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలి. ప్రభుత్వ మెడలు వంచుదాం. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని గవర్నర్ ని కోరాం.
ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది.

కేసీఆర్ ఆరాటం అంతా కుర్చీ పైనే ఉంది : ఈటల

పెన్ డ్రైవ్ లో పేపర్లు దొంగిలిస్తే TSPSC ఎం చేస్తుంది, సీసీ కెమెరాల ఎందుకు పనిచేయడం లేదు. రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయ్యాలి. Tspsc ప్రస్తుత బోర్డ్ ను రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చెయ్యాలి. విద్యార్దులు మనోదైర్యం కోల్పోవద్దు..

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents