బండి సంజయ్! రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎక్కడ?
ఈరోజు స్థానిక ప్రెస్ భవనంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రైల్వే గేటు వేయడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,రోజుకు 18 నుండి 20 సార్లు గేటు పడడం మూలంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు,ఉద్యోగాలకు వెళ్లే వారు,అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్స్ లు సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు
గత 2 సంవత్సరాల క్రితమే *రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు తెచ్చానని చెప్పుతున్న బండి సంజయ్ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తూ కరీంనగర్ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి కి రూ: 154 కోట్లు తెచ్చానని రెండుసార్లు పాలాభిషేకాలు చేసుకొని ఇప్పటివరకు శంకుస్థాపన కూడా చేయకపోవడం,పనులు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మాట్లాడితే మసీదులు కూల్చుతా, తనను గెలిపిస్తే కరీంనగర్ ను “కరీ”నగర్ చేస్తా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్
కరీంనగర్ నుండి కొత్తపెళ్లి మనోహరాబాద్ వెళ్లే రైల్వే మార్గానికి ఎందుకు నిధులు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుండి ఏం నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. 20/రూ: లకే పాల ప్యాకెట్ దొరుకుతుంది కదా అని పలుమార్లు పాలాభిషేకాలు చేసుకుంటున్నారే గాని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించడం లేదని ఎద్దేవ చేశారు. మసీదులు కూల్చుతా అని రెచ్చగొట్టే వాక్యాలు చేస్తూ, మతాల మధ్య వైశామ్యాలు పెంచుతూ,ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం సోదరులను బిజెపి కార్యాలయాలకు తీసుకెళ్లి ఇఫ్తార్ విందులు ఇవ్వడం ఓట్లు దండుకోవడం కోసం ఆడుతున్న నాటకాలేనని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని కరీంనగర్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసేంతవరకు ప్రజల పక్షాన సిపిఎం అండగా ఉండి పోరాడుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య,జి. తిరుపతి,కొంపల్లి సాగర్,K. అరవింద్,నగర నాయకులు కోనేటి నాగమణి,గాజుల కనకరాజు,రత్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు