Print Friendly, PDF & Email

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం

0 3,697
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం – వడ్డెర ఆత్మగౌరవ భవన నిర్మాణ ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి గంగుల – హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల్లో 41 ఆత్మగౌరభవనాల నిర్మాణం – శరవేగంగా కొనసాగుతున్న ఏక సంఘ ట్రస్ట్ ఆత్మగౌరవ భవన నిర్మాణాలు, ప్రభుత్వ నిర్మాణాలు

తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో బీసీ కులాల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల విలువైన స్థలాన్ని హైదరాబాద్ నడిబొడ్డున కేటాయించింది, కోకాపేట్ ఉప్పల్ బాగా ఎత్తులోని 87.3 ఎకరాల్లో 41 వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించబోతుంది, ఇందులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు కరీంనగర్ లోని తన నివాసంలో వడ్డెర కుల సంఘ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్సుని ఏక కుల సంఘ నాయకులకు అందజేశారు.

ఉప్పల్ బగాయత్ లో ఎకరా స్థలం కోటి రూపాయలతో నిర్మించబోయే వడ్డెర కుల సంఘ భవనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అందుకున్న కుల సంఘ నాయకులు అతి త్వరలో ఆత్మగౌరభవన నిర్మాణం ప్రారంభించుకుంటామని తెలియజేశారు.

May be an image of 8 people

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కేవలం సీఎం కేసీఆర్ గారి కృషితోనే వెనుకబడిన వర్గాల్లో ఆత్మగౌరవం వెల్లివిరిస్తుందన్నారు. 19 బీసీ గురుకులాలను 310కి పెంచడమే కాకుండా ఒకే సంవత్సరంలో 112 గురుకులాలను జూనియర్ కాలేజీ లగా అప్గ్రేడ్ చేస్తూ నూతనంగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేసి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి చూపిస్తున్నారన్నారు. ఆత్మగౌరవ భవనాల కోసం సైతం వేల కోట్ల విలువైన స్థలాల్ని కేటాయించిన ముఖ్యమంత్రి కి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, ట్రస్ట్ చైర్మన్ జంపేటి సత్యనారాయణ రాజు, ఎత్తరి అంతయ్య ఒరుసు కృష్ణయ్య , అనంతరావు , మక్కల పెంటేష్ , వల్లెపు వెంకట్ వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents